యూనిఫామ్‌ రెడీ | - | Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌ రెడీ

Jun 10 2025 3:32 AM | Updated on Jun 10 2025 3:32 AM

యూనిఫ

యూనిఫామ్‌ రెడీ

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఓవైపు బడిబాటలో భాగంగా బడీడు పిల్లలను గుర్తించి స్కూల్లో చేర్పేంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇంటింటి సర్వేను కూడా కొనసాగిస్తున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ను అందజేయాలనే కృతనిశ్చయంతో సంబంధిత విద్యాశాఖ అధికారులున్నారు. ఈమేరకు హనుమకొండ, వరంగల్‌ జిల్లాలో సంబంధిత అధికారులు అన్ని మండలాల్లోని పాఠశాలల స్థాయిలోని సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల మహిళా సమాఖ్యలతో స్కూల్‌ యూనిఽఫామ్‌లు కుట్టించారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించిన టీఎల్‌ఎఫ్‌ల ద్వారా స్టిచ్చింగ్‌ చేయించారు. ఈసారి స్టిచ్చింగ్‌ డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్‌ఫ్రాక్‌లకు పట్టీలు, భుజాలపై కప్స్‌ వంటి ప్యాచ్‌లు లేకుండా స్టిచ్చింగ్‌ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాలల్లోని విద్యార్థులకు కొలతలు కూడా తీసుకుని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో కుట్టించే ప్రక్రియ కొనసాగింది.

తరగతుల వారీగా యూనిఽఫామ్‌ ఇలా..

ఒకటి నుంచి ఐదో తరగతి బాలురకు చొక్కా, నిక్కర్‌, ఆరు నుంచి 12 తరగతుల బాలురకు చొక్కా, ప్యాంట్‌, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్‌ఫ్రాక్‌, 4, 5 తరగతులకు బాలికలకు షర్ట్‌, స్కర్ట్‌, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్‌ మోడల్‌లో ఉండేలా లాప్‌బాటమ్‌ చున్నీ లేకుండా కుట్టించారు.

హనుమకొండ జిల్లాలో..

సోమవారం వరకు 317 పాఠశాలలకు 66 శాతం యూనిఫామ్స్‌ చేరవేశారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, యూఆర్‌ఎస్‌ స్కూల్స్‌ కలిపి 477 పాఠశాలల్లో 30,922 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలకు 16,070 మంది బాలురు 14,832 మంది ఉన్నారు. జిల్లాలో 91 శాతం స్కూల్‌ యూనిఫామ్స్‌ ఒక్కో విద్యార్థికి ఒక్కో జత కుట్టించే ప్రక్రియ పూర్తయ్యింది. ఇప్పటి వరకు 66 శాతం స్కూల్‌ యూనిఫామ్స్‌ ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ఈనెల 12వ తేదీ లోపు వందశాతం అన్ని స్కూళ్లకు చేర్చనున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు ఒక్కో జత స్కూల్‌ యూనిఫామ్‌ అందించనున్నారు.

పాఠశాల పునఃప్రారంభం రోజే అందజేస్తాం..

జిల్లాలో స్కూల్‌ యూనిఫామ్స్‌ ఒక్కో జత విద్యార్థులకు అందజేసేందుకు మహిళా సమాఖ్యలతో వందశాతం స్టిచ్చింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. పాఠశాలలకు చేరేవేసే ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు ఎక్కువ శాతం స్కూల్‌ యూనిఫామ్స్‌ పాఠశాలలకు చేరాయి. మరో రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా ఆదేశించాం.

– వాసంతి, డీఈఓ, హనుమకొండ

హనుమకొండ జిల్లాలో

30,922 మంది..

వరంగల్‌ జిల్లాలో 33,878 మంది విద్యార్థులకు ఒక్కోజత

పాఠశాలలకు పంపిణీ

రెండో జతకు రావాల్సి ఉన్న క్లాత్‌

యూనిఫామ్‌ రెడీ1
1/1

యూనిఫామ్‌ రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement