సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

Jun 9 2025 8:02 AM | Updated on Jun 9 2025 8:02 AM

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

నర్సంపేట/ దుగ్గొండి/ఖానాపురం: ప్రజాప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కల నెరవేరుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నా రు. నర్సంపేట పట్టణంలోని పలు వార్డులు, చెన్నారావుపేట మండలం కేంద్రంతోపాటు అక్కల్‌చెడ(కట్టాయపల్లి), దుగ్గొండి మండలంలోని వెంకటాపు రం, రేబల్లె, ఖానాపురం మండలంలోని బండమీదిమామిడితండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల కు ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆదివారం భూమి పూజలు చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో దశాబ్ధ కాలం తర్వాత నివాసం లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం హర్షనీ యం అన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నా రు. గత పాలకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్‌ బెడ్రూం కూడా నిర్మించలేక పోయారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు రాలేదని బాధపడాల్సిన అవస రం లేదని, త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హౌసింగ్‌ డీఈ విష్ణువర్ధన్‌, నర్సంపేట మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నర్సంపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బాబు, రాజేశ్వర్‌రావు, రామారావు, రామానంద్‌, హరిబాబు, జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ సునీల్‌కుమార్‌, వెంకటప్రసాదరావు, రాజేందర్‌, సాంబయ్యగౌడ్‌, విజయ్‌కుమార్‌, నరేందర్‌, యాకుబ్‌రెడ్డి, రజనీభారతి, సందీప్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement