చిన్నారికి వైద్యసాయం అందిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..

Jun 8 2025 1:51 AM | Updated on Jun 8 2025 1:51 AM

చిన్న

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..

నెక్కొండ: పుట్టుకతో మూగ, చెవిటితో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారికి వైద్యసాయం అందిస్తామని వరంగల్‌ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. మండల పరిధిలోని గొట్లకొండ శివారు సూర్యతండాకు చెందిన నూనావతు శిరీషశ్రీనివాస్‌ దంపతుల కూతురు లిఖతశ్రీ చెవిటి తనంతో ఇబ్బందులు పడుతోంది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఈ నెల 6న సీఎంవో కార్యాలయానికి ఫోన్‌ చేసి వైద్యసాయం అందించాలని కోరారు. దీంతో సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన సమాచరంతో కలెక్టర్‌ సత్యశారద స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు సంఘనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేపు హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌, నెక్కొండ పీహెచ్‌సీ వైద్యాధికారి సుమన్‌, ఎంఎల్‌హెచ్‌పీ మౌనిక, ఏఎన్‌ఎం యాకలక్ష్మి, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలను వినియోగించుకోవాలి

నర్సంపేట: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్‌ ప్రసూనలక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని, మల్లూరు, బొగత జలపాతం. కొమురవెళ్లి, వేములవాడ, కొండగట్టు ధర్మపురి, గూడెంగట్టు. నాగార్జునసాగర్‌, స్వర్ణగిరి, యాదగిరి. పంచరామాలు, అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట విజయవాడ, ద్వారకాతిరుమల, భద్రాచలానికి 40మంది ప్రయాణికులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడుతుందని తెలిపారు. వివరాలకు 9959226052, 9866373825, 9989038476నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

విద్యార్థుల నమోదు పెంచాలి

పర్వతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామస్తులు, తండావాసుల సహకారంతో విద్యార్థుల నమోదును పెంచాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు కోరారు. ఈ మేరకు మండల పరిధిలోని రోళ్లకల్‌, సాద్యతండా, సోమారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను శనివారం ఆయన సందర్శించి బడిబాట కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మన ఊరిలో ఉన్న బడిని మనమే కాపాడుకోవాలని నాయకులు, అధ్యాపకులకు సూచించారు. అనంతరం మండల పరిధిలోని సోమారం, జమాలపురం గ్రామాలకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే నాగరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టారు.

15 మంది ఎస్సైల బదిలీ

హసన్‌పర్తి: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శనివారం కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ఉత్తర్వులు జారీ చేశారు. రణధీర్‌రావును వరంగల్‌ ట్రాఫిక్‌నుంచి దుగ్గొండి స్టేషన్‌కు, వెంకటేశ్వర్లును దుగ్గొండినుంచి ఇంతేజార్‌గంజ్‌కు బదిలీ చేశారు. సుబేదారి ఈస్‌ఐ ఎన్‌.రవికిరణ్‌ను ఇంతేజార్‌గంజ్‌కు, మట్టెవాడ నుంచి ఎస్‌.విఠలను పరకాలకు, పరకాలలోని సంభాని శివకృష్ణను మట్టెవాడకు, నవీన్‌కుమార్‌ను మట్టెవాడనుంచి కేయూసీకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అదేవిధంగా ఆర్‌.రామారావును కాజీపేట ట్రాఫిక్‌నుంచి సీఎస్‌బీ వరంగల్‌కు, డి.రాజును సీపీటీసీనుంచి వరంగల్‌ ఏనుమాములకు, వీఆర్‌ అటాచ్డ్‌, ఇంతేజార్‌గంజ్‌లో ఉన్న చాంద్‌పాషాను కేయూసీకి, పోస్టింగ్‌ కోసం వేచిచూస్తున్న బి.శ్రీనివాస్‌ను మట్టెవాడకు, ఎం.సతీష్‌ను ఆత్మకూర్‌కు, శ్రవణ్‌కుమార్‌ను వీఆర్‌ కాజీపేట ట్రాఫిక్‌కు, బి.జనార్దన్‌ను సుబేదారికి, నారాయణను హనుమకొండ ట్రాఫిక్‌కు, సీతారాములును వరంగల్‌ ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..
1
1/2

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..
2
2/2

చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement