విధుల్లో చేరిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన ఎస్పీ

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

నిప్పుల కుంపటి

జాగ్రత్తలు తప్పనిసరి..

ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది.

జోగుళాంబ గద్వాలలో అత్యధికం..

ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్‌ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వనపర్తి: శిక్షణ నిమిత్తం వెళ్లిన ఎస్పీ సునీతరెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఇటీవల విధుల్లో చేరిన అదనపు ఎస్పీ (అడ్మిన్‌) రాజేష్‌ మీనా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువ ఐపీఎస్‌ అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, ప్రజాసేవలో నిబద్ధత, విధుల్లో కర్తవ్య నిష్ట, సమర్థ నాయకత్వ లక్షణాలతో జిల్లా పోలీసుశాఖకు మరింత బలాన్ని చేకూరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు

కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు

బయటకు వెళ్తే జాగ్రత్తలు

తప్పనిసరి అంటున్న వైద్యులు

అత్యవసరమైతేనే బయటకు..

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

– హేమంత కేశవ్‌ పాటిల్‌, కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement