ఈ చిత్రం చూశారా... ఇది నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రోడ్డు. ఇటీవల గొర్లిపేట, కొత్తపేట సమీపంలో తారురోడ్డు వేశారు. కనీసం విద్యుత్ స్తంభాలను పక్కకు జరపకుండా రోడ్డు వేయడంతో ఈ ప్రాంతీయులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నెల 27న రామతీర్థంలో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగిస్తారు. విద్యుత్ స్తంభాలు రోడ్డుపైనే ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. – నెల్లిమర్ల రూరల్


