
రామతీర్థంలో పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గురువారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మండపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి.. ఉత్సవ మూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, పవన్, రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు