
ఐదో సారీ..!
నాపై కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నాపై కక్ష సాధింపు జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఎలాంటి కారణం లేకుండానే సస్పెన్షన్ విధించారు. నాలుగు సార్లు హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నాను. అయినప్పటికీ మళ్లీ నా పొట్టకొట్టేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేస్తాను.
– నీలకంఠం, రేషన్ డిపో డీలర్,
పత్తికాయవలస, చీపురుపల్లి మండలం
ఫిర్యాదు మేరకు చర్యలు
పత్తికాయవలస డీలర్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు అందాయి. వృద్ధులు, దివ్యాంగుల వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై సీఎస్డీటీ నేతృత్వంలో విచారణ నిర్వహించాం. దీంతో పాటు డిపోలో సరుకుల నిల్వలో కూడా తేడాలు ఉన్నట్లు సీఎస్డీటీ, క్షేత్రస్థాయి అధికారులు గుర్తించి రిపోర్టు సమర్పించారు. దీనిపై విచారణ చేసి రేషన్ డిపో స్వాధీనం చేసుకుని పక్క గ్రామం డీలర్కు అప్పగించాం. పూర్తి నివేదికను ఆర్డీఓకు సమర్పిస్తున్నాం. ఆర్డీఓ నేతృత్వంలో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
– డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి

ఐదో సారీ..!