
వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడిగా కిల్లి
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన కిల్లి సత్యనారాయణను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా నియోజకవర్గ పరిశీలకులు పనిచేస్తారు. పార్టీలో సీనియర్ నేతగా, సుదీర్ఘకాలం సర్పంచ్గా, రెండు పర్యాయాలు ఎంపీపీగా సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
వెబ్సైట్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో 29 ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లో పొందుపరచినట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే మే నెల 3వ తేదీలోగా డీసీహెచ్ఎస్ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.
బాల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 32 బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వీటిలో ప్రభుత్వ ఆధ్వర్వంలో ఐదు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 27 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు అందినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. జువైనల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కేంద్రాల ఏర్పాటుకు డీపీఓ కన్వీనర్గా ఉన్న ఇన్స్పెక్షన్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. వాటిని కలెక్టర్ చాంబర్లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, ఏఎస్పీ సౌమ్యలత, ఐడీసీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడిగా కిల్లి