
పార్వతీపురం టౌన్: ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ స్కాలర్షిప్ ఎన్ఎంఎన్ఎస్ పరీక్ష 2023 సంవత్సరానికి ఎంపికై న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వారి పేర్లు నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, విద్య, మంత్రిత్వ శాఖ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా మెరిట్ కార్డుపై ముద్రించిన విధంగా ఆధార్, బ్యాంక్ పాస్బుక్కుల్లో ఉండేవిధంగా పోర్టల్లో నవంబర్ 30 లోగా నమోదు చేయాలని సూచించారు. సంబంధిత పాఠశాలల మోడల్ అధికారి డిసెంబర్ 15వ తేదీలోగా క్షుణ్ణంగా పరిశీలించి వివరాల నమోదు తీరును పరిశీలించాలని పిలుపునిచ్చారు. నమోదు చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసి దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం, బ్యాంకు, అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ జతపరిచి డీఈఓ కార్యాలయానికి సమర్పించాలని వివరించారు. జిల్లా మోడల్ అధికారి లాగిన్ ద్వారా వెరిఫై చేయించుకున్న అప్లికేషన్లకు మాత్రమే స్కాలర్షిప్ మంజూరవుతుందని స్పష్టం చేశారు. గతంలో ఈ పరీక్షకు ఎంపికై ప్రస్తుతం 10,11,12 తరగతులు చదువుతూ అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఈ ఏడాది రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్