శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్ ఓవర్లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఫైనల్ సాగిందిలా..
స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి.


