మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

Sep 29 2025 11:12 AM | Updated on Sep 29 2025 11:12 AM

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు

సీతంపేట: నగరానికి చెందిన పైడి శంకర్రావు దర్శకత్వంలో సుదీప్‌ సాయి హీరోగా నటించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ మాజీ సభ్యుడు డాక్టర్‌ సుందర్‌ మురుగన్‌ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్‌ సాయిని సీఎం సత్కరించారు. చిత్ర యూనిట్‌ తరఫున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement