ఆరిలోవ : డీఎస్సీ–2025లో మెరిట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించినా ఉద్యోగానికి దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలుకాలేదని గగ్గోలుపెడుతున్నారు. అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్లోకి దించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ రిజర్వేషన్ల కోటాలో కూటమి ప్రభుత్వం కోత విధించింది. దీంతో బాధిత అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ మెరిట్ జాబితా ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు రాని సుమారు 20 మంది అభ్యర్థులు విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్కు చేరుకున్నారు. వారంతా అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. వారికి కాల్ లెటర్లు రాకపోవడంతో వారి వారి ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన వినతి పత్రాలను జాయింట్ కలెక్టర్కు అందించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, జనరల్ కేటగిరీలో ర్యాంకులు సాధించిన వారిని రిజర్వేషన్ కేటగిరీలోకి మార్చడం రాజ్యాంగ విరుద్ధమంటూ నినాదాలు చేశారు. జిల్లాలో ఎస్జీటీ ఓపెన్లో 115 పోస్టులు ఉండగా మెరిట్లో ఎంపికై న 58 మందిలో 20 మందికిపైగా ఎస్సీ, ఎస్టీలు మంచి ర్యాంకులు సాధించారని.. వారిని ఓపెన్ కేటగిరీ జాబితాలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీకి మార్చేశారని.. దీంతో రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన 20 మంది రిజర్వడ్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి కాల్ లెటర్లు పంపలేదని వాపోయారు.
ఎస్సీ ‘బీ’లో 360 ర్యాంక్ సాధించినా కాల్ లెటర్ పంపలేదు..
నేను ఎస్సీ ‘బి’ కేటగిరికి చెందిన అభ్యర్థిని. నేను 360వ ర్యాంక్ సాధించారు. 77 జీవో ప్రకారం వర్టికల్ విధానం పాటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది. ఓపెన్లో 39వ ర్యాంకర్ను ఎస్సీ‘బీ’ కేటగిరిలోకి మార్చేశారు. దీంతో నా స్థానం కోల్పోయాను. ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది.
–శేఖర్బాబు, విశాఖ,
195 ర్యాంక్ వచ్చినా..
డీఎస్సీలో 195 ర్యాంక్ సాధించాను. నాది బీసీ ‘ఏ’ కేటగిరి. మా కేటగిరిలో 10 పోస్టులున్నాయి. బీసీ‘ఏ’లో నేను 7వ స్థానంలో ఉన్నాను. ఓపెన్లో ఉన్న అభ్యర్థులను బీసీ ‘ఏ’ కేటగిరిలోకి మార్చడంతో నాకు కాల్ లెటర్ రాలేదు. నా తర్వాత స్థానంలో ఉన్న ముగ్గురు అమ్మాయిలకు మాత్రం కాల్ లెటర్లు వచ్చాయి. –నరవ రాజేష్,
కోరాడ సంతపాలెం, కె.కోటపాడు మండలం
రాజ్యాంగ విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు
డీఎస్సీ–2025 నియామకాల్లో రిజర్వేషన్ల విధానం గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు జరుపుతోంది. మెరిట్లో నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ప్రభుత్వం ఆవేదనకు గురిచేస్తుంది. ఆయా కేటగిరీల అభ్యర్థులు మెరిట్ సాధించనప్పటికీ రిజర్వేషన్ కోటాలోకి మార్చడం జీవో 77కి విరుద్ధం. రోస్టర్లో వర్టికల్ విధానంలో రిజర్వేషన్ అమలు చేయాలి.
– డాక్టర్ బూసి వెంకటరావు విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్,
బీసీ ‘ఏ’లో 141వ ర్యాంక్ సాధించినా కాల్ లెటర్ రాలేదు..
నేను బీసీ‘ఏ’ కేటగిరీకి చెందిన అభ్యర్థిని. ఈ డీఎస్సీలో 141వ ర్యాంక్ సాధించాను. ఓపెన్లో 23వ ర్యాంకర్ అయిన బీసీ‘ఏ’ అభ్యర్థిని బీసీ‘ఏ’ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టారు. దీంతో నా స్థానం వెనుకకు నెట్టేసి కాల్ లెటర్ పంపించలేదు. ఈ విధానం వల్ల నాకు అన్యాయం జరిగింది.
– శీలా అభియాంగో, విశాఖ
ఓపెన్లో 24వ ర్యాంకర్ను ఎస్సీ కేటగిరీలోకి మార్చేశారు..
ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్లో 7 పోస్టులు చూపించారు. నేను ఓపెన్లో 149వ ర్యాంక్ సాధించి ఎస్సీ కేటగిరీలో 7వ స్థానంలో ఉన్నాను. కానీ 24 ర్యాంక్ సాధించిన ఓపెన్లో ఉన్న వ్యక్తిని ఎస్సీ కేటగిరీలో మార్చారు. దీంతో నా స్థానంలో కిందకి వెళ్లిపోయి ఏడో స్థానం దాటిపోయింది. దానివల్ల నాకు కాల్ లెటర్ రాలేదు. ఓపెన్లో ఉన్న ఎస్సీ అభ్యర్థిని రిజర్వేషన్ కేటగిరీలో పెట్టేయడంతో ఏడో స్థానంలో ఉన్న నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం చేయాలి.
– అనిల్కుమార్, అవనాం, భీమిలి
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం