
నిబంధనాలు
మహారాణిపేట: కొత్త రేషన్ కార్డులు, మార్పులు–చేర్పులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కార్డుల కోసం అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యలు వెంటాడుతుండటంతో దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సర్వర్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్ట అధికారులు వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారులకు సాఫ్ట్వేర్ సమస్యలు తీవ్ర తలనొప్పిగా మారాయి. అవసరమైన పత్రాలున్నా, నిబంధనల కారణంగా దరఖాస్తు చేయలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త పేర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల ప్రతిరోజూ సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తక్షణమే సాఫ్ట్వేర్ను మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు ఇవే..
విద్యుత్ బిల్లులు అధికంగా వస్తే కొత్త కార్డుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. బిల్లులో తప్పులున్నా, విద్యుత్ అధికారుల సహాయంతో సరిచేసినా కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండటం లేదని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులు ఉన్న వారి పేరున కొత్త రేషన్ కార్డులు జారీ కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
హా భార్యాభర్తలు కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే, వారి ఆధార్ కార్డులో స్థానిక చిరునామా కాకుండా వేరే అడ్రస్ ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఇంటి మ్యాపింగ్ కూడా సక్రమంగా జరగడం లేదని లబి్ధదారులు వాపోతున్నారు. ఆధార్ కార్డులో చిరునామాలు సక్రమంగా ఉంటేనే ఇంటి మ్యాపింగ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా తల్లి, తండ్రి, కుమారుడు ఉన్నప్పుడు, కుమారుడికి వివాహం జరిగితే కొత్త కార్డు ఇవ్వడం లేదా ఈ కార్డు నుంచి తొలగించడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. కుమారుడు కుటుంబం వేరుగా ఉన్నా కొత్త కార్డు నమోదు చేయడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు చక్రాల వాహనం(వ్యక్తిగత వినియోగానికి) ఉన్నవారు.
ఆదాయపు పన్ను చెల్లించేవారు.
గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఎకరాల మాగాణి(వరి పండే భూమి) ఉన్నవారు, పదెకరాల మెట్ట భూమి ఉన్నవారు.
ప్రతి నెలా 300 యూనిట్లకు మించి విద్యుత్ (గృహావసరాలకు) వినియోగించేవారు.
నగరంలో 1000 చదరపు గజాల స్థలంలో ఇల్లు ఉన్నవారు.
పైన పేర్కొన్న అంశాలకు చెందినవారిని తెలుపు రేషన్ కార్డులకు అనర్హులుగా పరిగణిస్తారు.
కూటమి మోసంపై ఆగ్రహం
ఎన్నికల ముందు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్నా ప్రజలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కార్డుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అర్బన్ డీఎస్వో పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి తదితర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 5 లక్షల 12 వేల 619 తెలుపు కార్డులతోపాటు 625 చౌకధరల డిపోలు ఉన్నాయి.
సర్కార్ మొండి చెయ్యి
కూటమి నేతలు ఎన్నికల ముందు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు మొండిచేయి చూపుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటిన నేపథ్యంలో, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీంతో అర్హులైన ప్రజలు దరఖాస్తు పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లగా, అక్కడ వారికి నిరాశే మిగులుతోంది. కార్డులో పేర్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఎటువంటి ఆప్షన్ లేదని సచివాలయ సిబ్బంది చెప్పడంతో దరఖాస్తుదారులు షాక్కు గురై వెనుదిరుగుతున్నారు.