‘కూటమి’కి ప్రజాగ్రహం తప్పదు | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’కి ప్రజాగ్రహం తప్పదు

Jun 10 2025 6:50 AM | Updated on Jun 10 2025 6:50 AM

‘కూటమి’కి ప్రజాగ్రహం తప్పదు

‘కూటమి’కి ప్రజాగ్రహం తప్పదు

● వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో గొల్ల బాబూరావు

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్స్‌ సేవలు అంధకారంలో ఉన్నాయని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన విశాఖ బీచ్‌రోడ్డులో సముద్ర కెరటాల్లో చిక్కుకున్న ఒక బాలుడు సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని ఆయన ఆరోపించారు. వెంటనే అంబులెన్స్‌ వచ్చి ఉంటే ఆ బాలుడు బతికేవాడని, ఈ సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని బాబురావు అన్నారు. ‘పేదల ప్రాణాలు కాపాడలేని ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తప్పద’ని హెచ్చరించారు. ఈ దుస్థితిని చక్కదిద్దేందుకు తన ఎంపీ నిధుల నుంచి మూడు అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తానని ప్రకటించారు. ఈ అంబులెన్స్‌లకు డ్రైవర్లను తానే నియమించి, వారి జీతాలను కూడా స్వయంగా భరిస్తానని తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ కేడర్‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గొల్ల బాబూరావు మాట్లాడుతూ పార్లమెంటు నిధులను విశాఖ అభివృద్ధి కోసం వినియోగిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. గొల్ల బాబూరావు మంచి రాజకీయ నాయకుడిగానే కాకుండా సమర్థవంతమైన ప్రభుత్వ అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె. సుభద్ర, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌ కుమా ర్‌, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి , తైనాల విజయ కుమార్‌, తిప్పల గురుమూర్తి రెడ్డి, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌ కటమూరి సతీష్‌, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనేతలు పేర్ల విజయచందర్‌, రొంగలి జగన్నాఽథం, వుడా రవి, రవి రాజు, నడింపల్లి కృష్ణంరాజు, సతీష్‌ వర్మ, మంత్రి రాజశేఖర్‌, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, పల్లా చినతల్లి, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్‌, శివ రామకృష్ణ, భర్కత్‌ అలీ, ఎస్‌. ప్రసాదరావు, రామి రెడ్డి, బోండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, పీలా ప్రేమ కిరణ్‌ , రాయపు రెడ్డి అనిల్‌ కుమార్‌, దిలీప్‌ మారుతి ప్రసాద్‌ , కార్పొరేట్లు అల్లు శంకర్‌ రావు, కొండబాబు, కటారి అనిల్‌ కుమార్‌ రాజు, మువ్వల లక్ష్మీ, వావిలపల్లి ప్రసాద్‌, రెయ్యి వెంకటరమణ, శశికళ, పీవీ సురేష్‌ , భూపతి రాజు సుజాత, కాళిదాస్‌ రెడ్డి, అల్లంపల్లి రాజబాబు, వేంపాడ శ్రీనివాస్‌ రెడ్డి, కిరణ్‌ రాజు , పి.దుర్గారావు, నాగ మల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, సత్యాల సాగరిక, నీలి రవి, అప్పన్న , జి.నాగేంద్ర, బి.పద్మావతి, శ్రీదేవి వర్మ,జ్యోతి, గంగా మహేష్‌, సూర్య, మహేష్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement