
అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవ ఏర్పాట్లు
చెక్ బౌన్స్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారికి జైలు
8లో
మహారాణిపేట: వచ్చే నెల 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఆయన మంగళవారం కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కంపార్టుమెంట్ వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. కంపార్టుమెంట్ లోపలికి వచ్చే వారిని వలంటీర్ల సాయంతో సాంకతిక పరికరాలను ఉపయోగించి లెక్కించాలని, దానికి ముందుగా ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్లను అందించాలని సూచించారు. దీనికి ముందు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్, ఆయుష్ డైరెక్టర్ దినేశ్కుమార్లతో కలిసి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కార్యక్రమం జరిగే వివిధ ప్రాంతాలను పరిశీలించారు.
వచ్చే నెల 19న ఫుల్ డ్రెస్ రిహార్సల్
జూన్ 19న ఫుల్ డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రధాన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి రోజూ ఒక గంట యోగా ప్రాక్టీస్ చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ పీపీటీ సాయంతో వివరించారు. కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ జెట్టీ, డీసీపీ అజిత, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.