గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 9లోu 8లోu ● ‘విమోచనం’లో మనం

న్యూస్‌రీల్‌

తెలంగాణ విమోచన, సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లాకు చెందిన పలువురు చురుకై న పాత్ర పోషించారు. నిజాం నిరంకుశ పాలనపై గొంతెత్తి చాటారు. వీరోచిత పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపారు. రజాకార్ల చేతిలో అనేక మంది అమరులయ్యారు. వికారాబాద్‌ పట్టణం గాంధీ కాలనీకి చెందిన దొండేరావ్‌ జాదవ్‌ దేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. వారి నిరంకుశ పాలన, అరాచకాలను ప్రజలకు వివరించారు. దీంతో 1947 సెప్టెంబర్‌ 17న ఆయన్ను అరెస్టు చేసి కర్ణాటకలోని గుల్బర్గా జైలులో ఉంచారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారత ప్రభుత్వం ఆయన్ను 1948 సెప్టెంబర్‌ 17న విడుదల చేసింది, తామ్రపత్రంతో సత్కరించింది. వికారాబాద్‌లో ఆయన పేరిట శిలాఫలకం ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన నారాయణస్వామి కూడా అలుపెరగని పోరాటం చేశారు. ఇలా ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంగానే తెలంగాణ భారతదేశంలో విలీనమైంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విలీన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరిట కార్యక్రమాలు జరపాలని నిర్ణయించింది. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

– వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement