కుల్కచర్ల: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 35మంది కూలీలు రామలింగేశ్వర కళాశాల పరిసర ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 10గంటల ప్రాంతంలో తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి వారందరూ పరుగులు పెట్టగా.. ఇద్దరు తీవ్రంగా, మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. ఓ మహిళ కిందపడి గాయపడింది. బాధితులను తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్నగర్కు తరలించారు. గాయపడిన వారిని సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, కాంగ్రెస్ నేతలు భీంరెడ్డి, ఆంజనేయులు, జోగు వెంకటయ్య, గోపాల్, టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్ పరామర్శించారు.


