తాండూరు: మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్న సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కోరారు. గురువారం నగరంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు.
పీసీసీ చీఫ్ను కోరిన ఎమ్మెల్యే బీఎమ్మార్


