కేసులు పెండింగ్లో ఉండొద్దు
యాలాల: పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. గురువారం యాలాల పీఎస్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ తప్పనిసరిగా వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పీఎస్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలపై కఠినంగా ఉండాలన్నారు. అనంతరం పీఎస్లోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు విఠల్రెడ్డి, విఠల్, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదతరులు పాల్గొన్నారు.


