కష్టపడి పనిచేస్తే భవిష్యత్
అనంతగిరి: కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతీ సోషల్ మీడియా కోఆర్డినేటర్కు మంచి భవిష్యత్తు ఉంటుందని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సోషల్ మీడియా కార్యద ర్శి చామల రఘుపతిరెడ్డి, స్పోక్స్ పర్సన్ గౌరీసతీష్ , యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రెటరీ సంతోష్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, వికారాబాద్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చాపల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్


