
డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి
ఎస్ఐ వసంత్ జాదవ్
దోమ: విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయితో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ వసంత్జాదవ్ తెలిపారు. బుధవారం దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో షీటీం ఇంచార్జి నర్సింహులుతో కలిసి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులగురించి, డ్రగ్స్ రహిత సమా జం దిశగా ముందుకు సాగాలన్నారు. మహిళలపై ఎలాంటి దాడులు జరిగిన 100, 181 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం చేరవేయ్యాలన్నారు. మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930కి సమాచాం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు బి.సావిత్రి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.