ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
8లోu
షాద్నగర్: వేలు పట్టి నడిపించాడు... అక్షర ప్రపంచాన్ని పరిచయం చేశాడు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అండగా నిలిచాడు.. తాను ప్రస్తుతం లేకపోయినా నా నీడగా ఉంటూ నన్ను గెలిపించాడు.. అంటూ తన తండ్రి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సివిల్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఐఆర్ఎస్ సాధించిన కొర్రావత్ శశికాంత్. తన తండ్రి ప్రస్తుతం భౌతికంగా లేకున్నా తన హృదయంలో తనకు జీవితాన్ని, భవితవ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుంటాడని చెబుతున్నాడు ఈ ఐఆర్ఎస్ అధికారి.
సొంతూరిని విడిచి..
మాది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలోని చాకలిదాని తండా. తల్లిదండ్రులు రాములు నాయక్, సీతమ్మలకు రెండవ సంతానం. తనకు అన్న నీలిమ, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం షాద్నగర్కు తీసుకొచ్చాడు. హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వహిస్తూ చదివించాడు. తమను భవిష్యత్లో ఉన్నత స్థానంలో చూడాలన్నది ఆకాంక్ష. అందుకు ఆయన ఎంతో శ్రమించారు.
అపుడే నిర్ణయం తీసుకున్నా
నాన్న ప్రతి రోజు నా వెంట పాఠశాలకు వచ్చేవారు. చదువుల్లో రాణించి మంచి మార్కులు సాధించాలని చెప్పేవారు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఉపాధ్యాయులను అడగాలని సూచించేవారు. ఎంతో గారాబంగా పెంచారు. 8వ తరగతి వరకు షాద్నగర్లో పూర్తి చేసిన తర్వాత 9,10 వట్టెం నవోదయలో చేర్పించాడు. అప్పుడే నేను సివిల్స్ వైపు దృష్టి సారించాను. నాన్న ఆశయాలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అనంతరం ఇంటర్ హైదరాబాద్ వికాస్లో, బీటెక్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశా.
గెలుపు చూడకుండానే విడిచి వెళ్లిపోయాడు
తనను ఉన్నత స్థానంలో నిలిపేందుకు నాన్న అన్నివిధాలా ప్రోత్సహించారు. 2008 బీటెక్ చదువుతుండగా ఆయన అకాల మరణం కలిచివేసింది.
నాన్న లేరనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మ ప్రోత్సాహంతో సివిల్స్లో ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉద్యోగం సాధించా. నేను సాధించిన లక్ష్యాన్ని నాన్న చూసి ఉంటే ఎంతో సంతోష పడేవాడు.
న్యూస్రీల్
నాన్న నడిపించాడు..
నన్ను గెలిపించాడు
సాగు.. పిరం! ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైం
సాగు.. పిరం! ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైం