వాహన పరిమితులు తప్పనిసరి
బొంరాస్పేట: వాహన పరిమితులు లేకుండా నడపటం చట్టరీత్యా నేరమని డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి కార్డెన్ సర్చ్లో పోలీసులు తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్ఐ పి.శంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. వాహనాల తనిఖీలో 53 ద్విచక్రవాహనాలు, నాలుగు జీపులు, కార్లు, మూడు ఆటోలతోపాటు మొత్తం 60 వాహనాలు అనుమతి పత్రాలు లేకపోవడం వంటి కారణలతో సీజ్ చేశారు. జరిమానాలు విధించారు. సరైన పత్రాలు పొంది వాహనాలు తీసుకువెళ్లాలని అన్నారు. తనిఖీల్లో సీఐలు శంకర్, వెంకట రమణయ్య, ఎస్ఐలు, ఏఎస్ఐలు, డబ్ల్యూ పీసీలు, పీసీలు, హోమ్గార్డులు పాల్గొన్నారు.
డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి
బొంరాస్పేటలో కార్డెన్ సర్చ్
60 వాహనాలు సీజ్