శ్రీకాళహస్తి ఆలయంలో అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ విధానం భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మేం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం శ్రీకాళహస్తికి చేరుకున్నాం. అద్దె గదిలో ఫ్రెష్అప్ అయ్యి, రూ.2,500 రాహు–కేతు పూజ నిర్వహించుకోవాలని ఆలయంలోకి వచ్చాం. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ మిషన్ల ద్వారా రాహు–కేతు పూజ టికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మిషన్లు ఏర్పాటు చేశారు కానీ అవి సరిగా పనిచేయడం లేదు. పనిచేసినా వాటిని ఎలా ఉపయోగించాలో మాకు అర్థం కావడం లేదు. – రాఘవేంద్ర రెడ్డి, మహబూబ్నగర్


