తిరుపతి అర్బన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ప్రశంసించారు. శనివారం విశ్వం స్కూల్లో విశ్వం సైనిక్– నవోదయ 2026 బ్రోచర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, శాసీ్త్రయ బోధనా విధానం, సమగ్ర కోచింగ్ ద్వారానే ఈ స్థాయి విజయాలు సాధ్యమని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాలు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. విశ్వచందన్రెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.


