– 8లో
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ లో మంగళవారం ఐషర్ వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి బోల్తా పడింది.
కాన్వొకేన్ల చలానాలు.. జన్యూన్ ధ్రువపత్రాల మాటేమిటి!
వచ్చేనెల 5వ తేదీన ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వందలాది మంది విద్యార్థులు కాన్వొకేషన్ కోసం రూ.వేలల్లో ఫీజుల చెల్లించారు. ఇందులోనూ మాఫియా హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జన్యూన్ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయంతో సంబంధం లేకుండా జన్యూన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి, అవినీతికి పాల్పడినట్లు అరోపణలు వస్తున్నాయి. లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలను డూప్లికేట్ చేసి రూ.లక్షలు కాజేశారంటే మిగిలిన యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి విద్యార్థులు చెల్లించిన ఫీజుల పరిస్థితి ఏమిటి, ఎన్ని రోజులుగా వ్యవహారం నడుస్తోందంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఎస్వీయూ పరిపాలనా భవనం


