ప్రఖ్యాత శైవక్షేత్రం గుడిమల్లం పరశురామేశ్వరాలయం ప్రధాన గోపుర కలశాలను తొలగించి, అందులో నిక్షిప్తమై ఉన్న వజ్ర, వైఢ్యూరాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, విలువైన ఇతర నవరత్నాలను ఆలయాధికారులతో కలిసి మాయం చేశారు. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. నియమాలను పాటించకుండా 2,600 ఏళ్ల నాటి ఆలయ కలశాలను మాయం చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించి, వాస్తవాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి.
– చిందేపల్లి మధుసూదన్రెడ్డి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి


