– పంచాయతీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఓజిలి: మండలంలోని పెదపరియ గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం తలుపులు తెరుచుకుని పార్టీ జెండాను ఎదురుగా కట్టి ఎగురవేశారు. ఈ విషయమై ఈఓపీఆర్డీ జమీర్బాషాను వివరణ కోరగా ఈ రోజు సెలవు కావడంతో టీడీపీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం మా దృష్టికి రాలేదన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శితో విచారణ చేయిస్తామని చెప్పారు.


