మిరుమిట్లు గొలుపుతూ ధగధగలాడే స్వర్ణ రథంలో తేజోమూర్తి అయిన శేషాచలవాసుడు కొలువుదీరారు.. తిరువీధుల్లో విహరించారు.. భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథోత్సవం దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మంగళవారం శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి స్వర్ణరథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, కలియుగవైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. – తిరుమల
స్వర్ణరథంపై విహరిస్తున్న మలయప్పస్వామి
అది టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం.. అందరూ సీఎం ఏమి మాట్లాడుతారోనని ఉత్కంఠ.. ఆయన వ్యంగ్యోక్తులతో చులకన.. ముఖ్యనేతల నుంచి చిన్నస్థాయి నాయకుల వరకు అందరికీ చురకలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు.. అసలే రెండు వర్గాలున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో అందరిపై తిట్ల దండకం మొదలు పెట్టడంతో అవమానంగా భావిస్తున్న నేతలు.. ఇదేమిటబ్బా అని తెలుగుతమ్ముళ్లలో అంతర్మథనం.. ఇదీ సీఎం చంద్రబాబు సూళ్లూరుపేట పర్యటన సారాంశం.
అవమానం..


