సంపూర్ణం.. సూర్యపూజోత్సవం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణం.. సూర్యపూజోత్సవం

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

తెప్పపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు

ఆలయంలో భక్తుల రద్దీ

నాగలాపురం : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న సూర్య పూజోత్సవాలు శనివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా వేకువజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. ఉదయం 11 గంటలకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి గర్భాలయాన్ని స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. అనంతరం ఉభయదేవేరీ సమేతంగా స్వామివారిని తిరుచ్చి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి సర్వాలంకారభూషితులైన స్వామి, అమ్మవార్లను పుష్కరిణలో తెప్పపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఏడుపర్యాయాలు ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్‌ మునిశంకరయ్య, స్పెషల్‌ ఆఫీసర్‌ గోవిందరాజులు, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement