
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
శ్రీకాళహస్తి: ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేసినట్లు రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎమ్మార్పల్లెకు చెందిన అల్తాఫ్(19)బైక్ మెకానిక్. శ్రీకాళహస్తి మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్(20)తో కలిసి మద్యం, గంజాయికి బానిసయ్యారు. ఈజీ మనీ కోసం వారు తిరుపతి బస్స్టేషన్, రైల్వేస్టేషన్, శ్రీకాళహస్తి బస్స్టేషన్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో బైక్లు దొంగలించే వారు. ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కుని పారిపోయేవారు. తిరుపతి ఎస్సీ హర్షవర్ధన్రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ పర్యవేక్షణలో రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.