● రోగుల జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి ● పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● రోగుల జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి ● పట్టించుకోని అధికారులు

Jun 11 2025 7:45 AM | Updated on Jun 11 2025 11:53 AM

● రోగుల జేబులు గుల్ల చేస్తున్న  కార్పొరేట్‌ ఆస్పత్రి ●

● రోగుల జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి ●

రోగుల జేబులు గుల్ల చేస్తున్న  కార్పొరేట్‌ ఆస్పత్రి 

 పట్టించుకోని అధికారులు 

తిరుపతి తుడా: ‘సేవలు చేయం.. రోగుల దోపిడీయే మా సంకల్పం’ అంటూ చెలరేగిపోతోంది తిరుపతిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యం. తుడా రోడ్డులో వెలసిన ఆ ఆస్పత్రి ధనార్జనే లక్ష్యంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తరచూ రోగుల బంధువులతో గొడవలకు దిగుతోంది. ఏదైనా జబ్బుతో ఆస్పత్రికి వస్తే లేనివి ఉన్నట్లు చూపుతూ లక్షలు గుంజేయడం రివాజుగా మారుతోంది.

ఓపీ నుంచే గుంజుడు మొదలు

ఆస్పత్రిలో ఓపీ తీసుకోవడం మొదలు వైద్య, వివిధ అనవసర పరీక్షలు, ఆపై అడ్మిషన్‌, చికిత్స అంతా ఇక రోగి బంధువుల చేతిలో ఉండదు. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపుతూ రోగి తోపాటు బంధువులను భయాందోళనకు గురిచేయడం ఆస్పత్రికి అలవాటుగా మారింది. ఐసీయూ పేరుతో రోజుకు వేలాది రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బు కోసం శవాలకు సైతం చికిత్స అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో వివాదాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. రోగుల బంధువులను కట్టడి చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎవరైనా అక్కడ ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఆ ఆస్పత్రిలో చేరితే ఇక అంతే!

గంగాధరనెల్లూరుకు చెందిన 58 ఏళ్ల మహిళకు తల తిరుగుతుండడంతో ఇటీవల ఆస్పత్రికి వచ్చారు. రోగి బంధువుల ముందు నానాహంగామా సృష్టించి స్కానింగ్‌ చేయించారు. అత్యవసరంగా ఐసీయూలో చికిత్స అందించాలంటూ హడావిడి చేశారు. ఏదో జరిగిపోతుందన్న భయంలో ఒకరోజు బంధువులు అందుకు సరే అన్నారు. వారం రోజులు పాటు ఐసీయూలో చికిత్స అందించి వ్యాధి నయం అయిపోయిందంటూ పంపిం చేశారు. రోజుకు రూ.30 వేల చొప్పున రూ.2.10 లక్షలు, మెడిసిన్‌కు లక్ష ఇరవై వేలు, ఓపీ, వివిధ స్కానింగ్‌ల కోసం మరో రూ.28,000 కట్టించుకుని జేబులు నింపుకున్నారు. ఈ ఆస్పత్రి రిపోర్టులను మరో వైద్యుని దగ్గర చూపించగా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందించే అంత వ్యాధి లేదని నిరూపితమైంది. దీంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. అలాగే నాలుగు రోజుల క్రితం రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళకు అందించిన చికిత్స వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రోగి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు తరచూ వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి.

తుడా రోడ్డులోని ఆస్పత్రిలో రోగి బంధువుతో సిబ్బంది వాగ్వాదం

నేమ్‌ బోర్డుల్లో మాత్రమే వైద్యులు

ఆస్పత్రిలోకి ప్రవేశించిన వెంటనే ప్రముఖ వైద్యుల పేర్లతో డిస్‌ప్లే కనిపిస్తుంది. అబ్బా... ఇక్కడ ఇంతమంది వైద్యులు ఉంటారా..? అని అనుకుంటే పొరబాటే. కానీ అక్కడ ఆ స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండరు. గెస్ట్‌ డాక్టర్లు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో అక్కడే నర్సులు, ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ల అవతారం ఎత్తుతారు. నానా హంగామా చేసి బిల్లులు మెడకు చుట్టేస్తారు. – శ్రీహరి, రోగి బంధువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement