
పరిపూర్ణం.. తెప్పోత్సవం
తిరుచానూరు పద్మావతీ దేవి వార్షిక తెప్పోత్సవాలు ఐదోరోజు బుధవారంతో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు అమ్మవారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సిరులతల్లిని పుష్కరిణి మధ్యలోని నీరాడ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6.30గంటలకు దివ్యాలంకార శోభితురాలైన శ్రీవారి దేవేరి తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి వైభవంగా అమ్మవారికి గరుడసేవ నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, ఆలయ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. – చంద్రగిరి

పరిపూర్ణం.. తెప్పోత్సవం