పరిపూర్ణం.. తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

పరిపూర్ణం.. తెప్పోత్సవం

Jun 12 2025 7:31 AM | Updated on Jun 12 2025 7:31 AM

పరిపూ

పరిపూర్ణం.. తెప్పోత్సవం

తిరుచానూరు పద్మావతీ దేవి వార్షిక తెప్పోత్సవాలు ఐదోరోజు బుధవారంతో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు అమ్మవారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సిరులతల్లిని పుష్కరిణి మధ్యలోని నీరాడ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 6.30గంటలకు దివ్యాలంకార శోభితురాలైన శ్రీవారి దేవేరి తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి వైభవంగా అమ్మవారికి గరుడసేవ నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్‌, శ్రీవాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ పాల్గొన్నారు. – చంద్రగిరి

పరిపూర్ణం.. తెప్పోత్సవం1
1/1

పరిపూర్ణం.. తెప్పోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement