
విమాన ప్రమాద మృతులకు నివాళి
తిరుపతి మంగళం : విమాన ప్రమాదంలోని మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ గురువారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషతో పాటు పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద విమాన ప్రమాదం ప్రపంచాన్నే కలిచివేసిందన్నారు. ఈ విమాన ఘోర ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహనరావు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ఇంతకన్నా తక్కువ పరిస్థితులు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు, మంత్రులు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. విమానయాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక సాయం చేయాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వుత్తులతో నివాళులర్పించారు.
మాజీ సీఎంతో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది
నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విమానశాఖ మంత్రి రాజీనామా చేయాలి
తిరుపతిలో కొవ్వొత్తులతో పార్టీ శ్రేణులతో కలిసి భూమన నివాళి