
● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప
పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కావడంతో ఎంతో ఉత్సాహంగా సర్కారు బడులకు వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కొన్ని తరగతి గదుల్లో టీచర్ల ముఖం చూడకుండానే తొలిరోజు ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని బడుల్లో విరిగిన తలుపులు, పనిచేయని ఆర్వోప్లాంట్లు విద్యార్థులకు స్వాగతం పలికాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వ బడుల వైభవాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తలచుకోవడం కనిపించింది.
తిరుపతి ఎంజీఎం పాఠశాలలో కుర్చీలను, బల్లలను మోసుకెళ్తున్న విద్యార్థులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లోని అనేక సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలికాయి. పలుచోట్ల అసంపూర్తిగా ఉన్న తరగతి గదులు, విరిగిన తలుపులు, కిటికీలు, ఊడిన బ్లాక్బోర్డులు, రెక్కలు లేని ఫ్యాన్లు, పనిచేయని ఆర్ఓ ప్లాంట్లు, నాణ్యత లేని మధ్యాహ్న భోజనం, అపరిశుభ్రంగా పాఠశాలల ఆవరణం వంటి అనేక సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలికాయి. జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులే చీపుర్లు పట్టి తరగతి గదులను శుభ్రం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పలు పాఠశాలల్లో అటెండర్లు లేక హెచ్ఎంలు, టీచర్లే బడిగంట మోగించారు. జిల్లాలో తొలిరోజు సర్కారు బడుల నిర్వహణ తీరుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
వేసవి సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లల్లో వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగిన చదువులు.. ప్రస్తుతం కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. మరికొన్ని చోట్ల తరగతి గదులు, వంటశాలలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహణ లేక మూతపడ్డాయి. విద్యామిత్ర కిట్లను అరకొరగా పంపిణీ చేసి మమ అనిపించారు.
జాడేలేని కొత్త అడ్మిషన్లు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాల్లోని సర్కారు పాఠశాలల్లో తొలిరోజు నూతన ప్రవేశాల జాడ కనిపించని పరిస్థితి. గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్సీపీ అమలు చేసిన నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, ట్యాబుల పంపిణీ, సీబీఎస్ఈ పాఠశాలలు, పలు విప్లవాత్మకమైన మార్పులకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులయ్యారు. గత ఐదు సంవత్సరాల్లో తొలిరోజు జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాల చూసిన అడ్మిషన్లతో కిటకిటలాడేది. కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు సైతం పెట్టారు. ప్రస్తుతం కూటమి పాలనలో సర్కారు బడుల్లో విద్యాభివృద్ధిపై చూపుతున్న అలసత్వ వైఖరికి తొలిరోజు అడ్మిషన్లు లేక బడులు వెలవెలబోయాయి.
కనిపించని బడిబాట
సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచుకునేందుకు ఏటా వేసవి సెలవుల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో ఎలాంటి బడిబాట కార్యక్రమం నిర్వహించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పట్టింపు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరం తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది.
సమస్యల తోరణం
జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఆహ్లాదకరంగా, మెరుగైన వసతులతో ఉండాల్సిన సర్కారు బడులు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలికాయి. గత ఐదేళ్ల పాటు అధునాతన హంగులతో వెలుగు వెలిగిన సర్కారు బడులు ప్రస్తుతం ధీన స్థితికి చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో ఏటా తొలిరోజు సర్కారు బడులు కళకళ లాడుతూ విద్యార్థులు కనిపించేవారు. ప్రస్తుతం తొలిరోజు జిల్లా వ్యాప్తంగా గత పరిస్థితులేవీ కనిపించని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఫౌండేషన్ పాఠశాలలు 1054, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు301, మోడ్రన్ ప్రైమరీ పాఠశాలలు 613, ప్రాథమి కోన్నత పాఠశాలలు 8, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ 262, మొత్తం 2,238 పాఠశాలల్లో 1,42,356 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
నాడు విద్యా పురోగతి
గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. పాడుబడిన పాఠశాలల భవనాలు నాడు–నేడుతో రూపురేఖలు దిద్దుకున్నాయి. కార్పొరేట్కు దీటుగా వసతులు తీర్చిదిద్దారు. 2019లో జగనన్న సీఎం అయ్యాక విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్బుక్స్, డిక్షనరీ, స్కూలు బ్యాగులు, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, టైలను స్కూలు తెరిచే మొదటి రోజే వాటిని పిల్లలకు అందించేవారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఐవీఎఫ్ ప్యానల్, స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ విద్యాబోధన అందించారు. బైజూస్ కంటెంట్తో దాదాపు రూ.32 వేలు విలువైన శాంసంగ్ ట్యాబ్లను ఉచితంగా అందించి విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేశారు.
నేడు తిరోగమనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు తిరోగమనం వైపు పయనిస్తూ గత టీడీపీ పాలనను గుర్తుకు తెస్తున్నాయి. మలి విడత నాడు–నేడుకు సరైన నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళిలా మారాయి. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆశ సన్నగిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు బాటపట్టారు.
అరకొరగా విద్యార్థి మిత్ర కిట్లు
పాఠశాలలు తెరిచే తొలి రోజే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి డా.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందజేస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రగల్భాలు తొలి రోజే తుస్సుమన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో పూర్తి స్థాయిలో విద్యార్థి మిత్ర కిట్లను అందజేయని పరిస్థితి. ఈ కిట్లలో విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్, డిక్షనరీ, వర్క్ పుస్తకాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో షూలు, యూనిఫాంలు పూర్తి స్థాయిలో అందలేదు.
కనిపించని ఉపాధ్యాయులు
గత వైఎస్సార్సీపీ హయాంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లోపే పూర్తి చేసేవారు. తద్వారా పాఠశాలల పునఃప్రారంభం నాటికే ఉపాధ్యాయులందరూ పాఠశాలల్లో కనిపించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బదిలీల ప్రక్రియ నేటికీ నత్తనడకన కొనసాగుతుండడంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కనిపించని దుస్థితి నెలకొంది.

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప

● సమస్యల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు శాప