
బస్పాస్ల జారీకి బ్రేక్
– 14 నుంచి పునఃప్రారంభం
తిరుపతి అర్బన్ : జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభముతున్న నేపథ్యంలో బుధవారం ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు బస్ పాస్లు జారీ చేపట్టారు. అయితే కొత్త మోడల్లో పాస్ ఇవ్వాలని నిర్ణయించినందున ప్రక్రియను నిలుపుదల చేసినట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం వెల్లడించారు. ఈ మేరకు శనివారం నుంచి జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో విద్యార్థులకు బస్పాస్లు జారీ చేయనున్నట్లు వివరించారు. అలాగే కొత్తగా బస్పాస్ తీసుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం బస్టాండ్కు వెళ్లలేని పరిస్థితుల్లో ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
వీఆర్కు వెంకటగిరి ఎస్ఐ
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావును వీఆర్కు పంపుతూ ఎస్పీ హర్షవర్ధన్రాజు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో అలసత్వం, దురుసు ప్రవర్తన కారణంగా ఆయనపై వేటు పడినట్లు తెలిసింది. ఎస్ఐ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు రావడంతో ఎస్పీ విచారణ చేయించి వచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
నేడు 501 నుంచి ఎస్జీటీల కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీల సీనియారిటీ జాబితాలో 501 సీరియల్ నంబర్ నుంచి ఈనెల 12న బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చిత్తూరులోని షర్మన్ పాఠశాలలో గురువారం 501 నంబర్ నుంచి 1000 వరకు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. సంబంధిత టీచర్లు కౌన్సెలింగ్కు తప్పక హాజరు కావాలని ఆదేశించారు.