న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ

Published Sat, May 25 2024 1:00 AM

న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ

తిరుపతి లీగల్‌ : రాయలసీమ జిల్లాలోని 30 మంది న్యాయమూర్తులకు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి శ్వేత భవనంనలో వివిధ అంశాలపై న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు చేపట్టారు. అనంతరం సీనియర్‌ ట్రైనీలు ప్రసాద్‌ సుబ్బన్న, సుదర్శన్‌ సుందర్‌ను న్యాయమూర్తులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ జి.రామ్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement