తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలోని వయోవృద్ధుల చికిత్స వార్డులో ఇటీవల ఓ వృద్ధురాలు నుంచి కమ్మలు కాజేసిన వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సెక్యూరిటీ సిబ్బంది కథనం.. రుయా ప్రాంగణంలో అనుమానంగా తిరుగుతున్న మహేష్ అనే వ్యక్తిని పట్టుకుని గతంలో కమ్మలు కాజేసిన సందర్భంలో సేకరించిన ఫొటోలను పరిశీలించారు. ఫొటో మ్యాచ్ అవడంతో సిబ్బంది మంగళవారం వెస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే వ్యక్తి గతంలో మెటర్నటీ ఆస్పత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తూ.. రోగుల నుంచి మొబైల్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. పట్టుబడ్డ మహేష్ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment