జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సిలబస్తో కూడిన పుస్తకాలు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారులు వారంలోపు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. నూతన సిలబస్కు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు సమర్థులైన అధ్యాపకులు ఉన్నారు. పోటీ పరీక్షలకు సైతం విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం.
– జి.రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి


