క్యాబిన్‌లో ఇరుక్కుని.. | Warangal Road Accident | Sakshi
Sakshi News home page

క్యాబిన్‌లో ఇరుక్కుని..

Aug 16 2025 7:28 AM | Updated on Aug 16 2025 7:28 AM

Warangal Road Accident

లారీడ్రైవర్‌ నరకయాతన 

ఢీకొన్న లారీ, బస్సు

 17 మందికి తీవ్ర గాయాలు

 వరంగల్‌ జిల్లాలో ఘటన

వరంగల్‌ జిల్లా: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మైలారం, మొరిపిరాల మధ్యలో జాతీయ రహదారిపై లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్, క్లీనర్‌ తీవ్రగాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. 

శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు హనుమకొండనుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ప్లాస్టిక్‌ వస్తువుల లోడ్‌తో ఓ లారీ విజయవాడ నుంచి హనుమకొండ వైపు వస్తోంది. ఈ క్రమంలో మైలారం, మొరిపిరాల మధ్యలో బ్రిడ్జి వద్ద గుంతలను తప్పించుకునే క్రమంలో లారీ, బస్సు ఎదురెదు రుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం, వర్ధన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా.. పోలీసులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి క్యాబిన్‌ను విడగొట్టి వారిని బయటకు తీశారు. వైద్యంకోసం వీరిని ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటన తో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌లకు ఫోన్‌లో ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement