ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయభేరి | Varada Reddy Says SR College Students Top In JEE Mains Results 2020 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయభేరి

Sep 13 2020 12:56 PM | Updated on Sep 13 2020 12:59 PM

Varada Reddy Says SR College Students Top In JEE Mains Results 2020 - Sakshi

సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్‌)లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల కార్యాలయంలో విద్యార్థులను శనివారం ఆ సంస్థల చైర్మన్‌ వరదారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేఈఈ(మెయిన్స్‌) ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలకు చెందిన ఎం.చేతన్‌ (ఏపీపీ నెంబర్‌ 200310022672) జాతీయ స్ధాయిలో రిజర్వేషన్‌ కేటగిరిలో 39వ ర్యాంకు, డి.సాయిరోహిత్‌రెడ్డి (ఏపీపీ నెంబర్‌ 2003189958) రిజర్వేషన్‌ కేటగిరిలో 115వ ర్యాంకు, పి.సంతోష్‌వ్యాస్‌ (ఏపీపీ నెంబర్‌ 200310009430) రిజర్వేషన్‌ కేటగిరిలో 141వ ర్యాంకు సాధించారని తెలిపా రు.  జేఈఈ(అడ్వాన్స్‌డ్‌)కు 916 మంది పైగా ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement