Hyderabad: నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic restrictions in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Sep 14 2025 8:05 AM | Updated on Sep 14 2025 8:05 AM

Traffic restrictions in Hyderabad

హైదరాబాద్‌: నగర ప్రజలకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్‌– ఉన్‌– నబీ ఊరేగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 

మిలాద్‌–ఉన్‌–నబీ ఊరేగింపుల దృష్ట్యా ఫలక్‌నుమా, ఇంజన్‌ బౌలి, నాగుల్‌చింత ఎక్స్‌ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, ఓల్గా, హరిబౌలి, పంచ్‌ మొహల్లా, చార్మినార్, గుల్జార్‌ హౌజ్, మదీనా జంక్షన్, పత్తర్‌గట్టి, మీరాలం మండీ, ఎతేబార్‌ చౌక్, అలీజా కోట్లా, బీబీ బజార్, వాల్టా హోటల్, అఫ్జల్‌గంజ్‌ టీ జంక్షన్, ఉస్మాన్‌ గంజ్, ఎంజే మార్కెట్‌ జంక్షన్, తాజ్‌ ఐలాండ్, నాంపల్లి టీ జంక్షన్, హజ్‌ హౌస్, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పారు.

 మిలాద్‌–ఉన్‌–నబీ ఊరేగింపు కారణంగా ఆదివారం ఓల్డ్‌ సిటీలోని పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి వెల్లడించారు. చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలను క్లోజ్‌ చేయనున్నట్లు ఆయన తెలిపార

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement