Telangana: మరో పది రోజులు లాక్‌డౌన్‌?

Telangana May Have Another Ten Days Lockdown - Sakshi

నేటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం 

సడలింపు వేళలు పెంచే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 30తో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ ముగియనుండగా, ఆ తర్వాత పొడిగించాలా.. వద్దా అన్న విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజుల నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినా, ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మళ్ళీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో మరో వారం, లేదా 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే, కొన్ని విషయాల్లో కొత్తగా సడలింపులు ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ దిశగా మంత్రివర్గం నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, ధాన్యం సేకరణ, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం అంశాలపై సైతం కేబినెట్‌ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top