సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్యాస్ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్పేట్లోని మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది.
సిలిండర్ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు.


