కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. అలా జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది: హైకోర్టు 

Telangana High Court Key Comments On Kamareddy Master Plan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డిలో మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు.. మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మాస్టర్‌ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు  బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. కాగా, మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలని రైతులు పిటిషన్‌లో కోరినప్పటికీ హైకోర్టు స్టేకు అనుమతివ్వలేదు. ఈ క్రమంలోనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అనంతరం, విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు.. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ఇప్పటికిప్పుడు ఏం కాదని హైకోర్టు తెలిపింది. హైదరాబాద్‌, వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌ విషయంలో ఏల్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే అనుకునవన్నీ జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని హైకోర్టు ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. ఈ సందర్బంలోనే మాస్టర్‌ప్లాన్‌పై రైతులు అభ్యంతరాలు తీసుకుంటామని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top