👉తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఎల్లుండి ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ
అసెంబ్లీలో కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వం
పాలమూరుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తీర్మానం
👉తెలంగాణ శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్
కృష్ణా జలాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీజేపీ
పాలమూరుపై ఉత్తమ్ సభలో వాస్తవాలు చెప్పారు: సీఎం రేవంత్
ఇరిగేషన్ విషయంలో సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పారు
కేసీఆర్ 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నారు..
ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని అనుకున్నాం
మంత్రి ఉత్తమ్ చాలా విషయాల వాస్తవాలను సభకు వివరించారు
కృష్ణా జలాలపై ఒక రోజు.. గోదావరి జలాలపై మరో రోజు చర్చిందామని అనుకున్నాం
శాసనసభ:
ప్రభుత్వ తీరుపై చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తి
అర్ధరాత్రి వరకు ఎజెండా స్టేటమెంట్ సభ్యులకు అందడం లేదు
ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మీరు స్పందించడం లేదు
ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడిన కృష్ణ గోదావరి తప్పితే ఇతర అంశాలు మాట్లాడడం లేదు
సభ నిబంధనలు సరిగ్గా పాటించకపోతే సభ్యులు ఇబ్బంది పడతారు
సభ్యులకు ఎజెండా స్టేట్మెంట్ కరెక్టు టైంకు ఇవ్వకపోతే ఎలా ప్రిపేర్ అవుతారు?
స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడాలి
సభ్యులకు ఎజెండా, స్టేట్మెంట్ సరైన సమయంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఉత్తమ్ కుమార్ రెడ్డి@అసెంబ్లీ
కృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
పాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదు
వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు
పాలమూరుకు కేవలం 27 వేల కోట్లు మాత్రమే
కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి
పాలమూరుకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు
పాలమూరు ప్రాజెక్ట్ను కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది
👉కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు: ఉత్తమ్
కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది: ఉత్తమ్
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం
👉బ్రేక్ తర్వాత ప్రారంభమైన శాసనసభ
కృష్ణ నది నీటి కేటాయింపులపై మొదలైన చర్చ..
👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సభలో ప్రతిపక్షం లేకున్నా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ పని చేశారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా.. కనీస స్పందన ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ శాసన సభలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగారు. తమ నియోజకవర్గంలో బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, టెక్నీకల్ సమస్యలతో ఇబ్బందులు పెట్టొద్దని సభలో కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని మరికొందరు ఎమ్మెల్యేలు కోరారు. అయితే..
దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘‘గతంలో 200 కోట్లు డబుల్ బెడ్ ఇండ్లకు బిల్లులు బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ వాళ్ళకే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు దత్తత తీసుకున్న వాసల మర్రిలో హామీ నెరవేర్చలేదు.
రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేస్తాం. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఇండ్ల స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇళ్లను ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రవ్యాప్తంగా 52,000 ఇండ్లు ఇప్పటికే గృహప్రవేశాలు అయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నాం. గ్రేటర్ సిటీని మూడు కార్పొరేషన్లుగా పెద్దగా చేసుకోబోతున్నాం’’ అని అన్నారాయన.
అసెంబ్లీలో ఇవాళ కృష్ణా జలాల అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న సమయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సభలోని స్పెషల్ హాల్లో ఏర్పాట్లు చేశారు.


