మొన్న గ్రూప్‌ వన్, ఇప్పుడు సివిల్స్‌ | Shivani from Warangal Secured AIR 11 Emerge As State Topper In Civils Examination | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో డబుల్‌ ధమాకా.. మొన్న గ్రూప్‌ వన్, ఇప్పుడు సివిల్స్‌

Apr 23 2025 10:01 AM | Updated on Apr 23 2025 11:06 AM

Shivani from Warangal Secured AIR 11 Emerge As State Topper In Civils Examination

సత్తాచాటిన వరంగల్‌ వాసి  

తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని

సాక్షి,  వరంగల్‌: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్స్‌ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్‌ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్‌ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్‌–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్‌ సాధించి ఔరా అనిపించారు. 

వరంగల్‌ శివనగర్‌ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్‌ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్‌ రిప్రజంటేటివ్‌ పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement