- కేవలం 4 రోజులలోనే రైతుభరోసా పథకం కింద 6590.37 కోట్లు రైతు ఖాతాలలో జమ
- ఈ రోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధుల విడుదల
- నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతుల ఖాతాలలో 1188 కోట్లు జమ
- ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రూ.6590.37 కోట్ల రైతుభరోసా సాయం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: రైతుభరోసా నిధులను రైతు ఖాతాలలో వేయడంలో రేవంత్ సర్కార్ మరోసారి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 30 న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం 4 రోజులలోనే రైతు భరోసా పథకం కింద 6590.37 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద ఈ రోజు నాలుగో విడతలో 4 నుండి 5 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే మొదటి మూడు విడతలలో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించమన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.


