మంథనిలో స్కిల్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం | Minister Sridhar Babu Inaugurated Centillion Company in Manthani | Sakshi
Sakshi News home page

మంథనిలో స్కిల్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం

Sep 15 2024 6:05 AM | Updated on Sep 15 2024 6:05 AM

Minister Sridhar Babu Inaugurated Centillion Company in Manthani

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథనిలో సెంటెలియన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి  

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో త్వరలో స్కిల్స్‌ సెంటర్‌ను స్థాపించి విద్యార్థులకు వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలో సెంటెలియన్‌ నెట్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బ్రాంచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్, అమెరికా, ఆ్రస్టేలియాతోపాటు మరో ఆరు దేశాల్లో వెయ్యి మంది ఉద్యోగులతో నడిచే ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ డైరెక్టర్లు రాధాకిశోర్, వెంకట్‌ తనకు మంచి మిత్రులన్నారు.

మంత్రిగా తాను ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా వారు అభినందించడానికి వచ్చారని, ఆ సమయంలో ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా కంపెనీ బ్రాంచ్‌ను మంథనిలో ఏర్పాటు చేయాలని, అప్పుడే తనకు నిజమైన గౌరవం దక్కుతుందని సూచించానన్నారు. ఇక్కడ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయం ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యాలయానికి అవసరమైన సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్‌ రాధాకిశోర్, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రు రమ, వైస్‌ చైర్మన్‌ సీపతి బానయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement