
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్లో భారీ ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో.. గత ఏడాది అక్టోబర్లో ఆమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపాలికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు.